by సూర్య | Tue, Jun 01, 2021, 07:52 PM
తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టమైపోతోంది. నయనతార తమిళ సినిమాలకే పరిమితం కావడం .. అనుష్క సినిమాలను పూర్తిగా తగ్గించేయడంతో, కాజల్ .. తమన్నాలతోనే సరిపెట్టేసుకుంటున్నారు. బాలకృష్ణకి గల ఇమేజ్ వేరు .. ఆయన జోడీగా కొత్త కథానాయికలను తీసుకోలేరు .. క్రేజ్ లేని వారిని తీసుకుని ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని త్రిషను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. చాలా రోజుల తరువాత తెలుగు నుంచి వెళ్లిన ఆఫర్ కనుక, త్రిష ఓకే అనొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు త్రిషకు మునుపటి క్రేజ్ లేదు. అందువలన శ్రుతి హసన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. శ్రుతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు.
Latest News