by సూర్య | Mon, May 31, 2021, 03:20 PM
ఓ వైపు నటనను కొనసాగిస్తూనే… మరోవైపు ప్రొడ్యూసర్గానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు యంగ్ హీరో విజయ్దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో గతంలోనే ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టిన విజయ్.. వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. గతంలో తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ను హీరోగా పెట్టి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చేశాడు. అది సోసోగానే ఆడినా.. వెనక్కి తగ్గలేదు. ఈసారి తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పుష్పక విమానం సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా పూర్తికాకముందే అప్పుడే మరో సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమైపోయాడు విజయ్ దేవరకొండ.కొత్త దర్శకుడు పృథ్వీ సేనారెడ్డితో తన మూడో సినిమాని నిర్మించబోతున్నాడు ఈ హీరో. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక విజయ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ చేస్తున్నాడు.
Latest News