by సూర్య | Sat, May 29, 2021, 01:03 PM
సోషల్ మీడియాలో కూడా తారక్ కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తన తాత జయంతి సందర్భంగా బావోద్వేగపూరిత సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మా గుండెలను మరోసారి తాకి పోండి తాతా అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక నందమూరి అభిమానులు జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటూ జూనియర్ ట్వీట్ కు కామెంట్లు జత చేశారు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు 12 వేలకుపై రీట్వీట్స్ రాగా..38వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే తాజాగా తారక్ తన ట్విట్టర్ ఖాతాను 5 మిలియన్ మార్క్ కు చేరుకున్నాడు. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News