by సూర్య | Sat, May 29, 2021, 12:37 PM
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ బడ్జెట్ సినిమా రామ్ సేతులో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు మేకర్స్ సత్యదేవ్ ను సంప్రదించారట. దాంతో సత్యదేవ్ కూడా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రామ్ సేతు చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుండి సినిమాలో భాగం చేస్తే ఇక్కడ కూడా సినిమాపై క్రేజ్ పెంచవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యదేవ్ కు ఆఫర్ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నుశ్రత్ భరుచ, జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
Latest News