'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్

by సూర్య | Fri, Apr 26, 2024, 03:07 PM

అర్జున్ YK దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సుహాస్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ప్రసన్న వదనం' అనే టైటిల్ ని లాక్ చేసారు. మే 3, 2024న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ మహిళా కథానాయికలుగా నటించారు.


ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవి శంకర్ హాజరుకానున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


నందు, వైవా హర్ష, చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM