ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు

by సూర్య | Mon, May 06, 2024, 09:02 PM

ప్రదీప్ రంగనాథన్ మరియు ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'లవ్ టుడే' 100 కోట్లకు పైగా గ్రాస్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ స్వయంగా దర్శకత్వం వహించారు.


నటుడు మరియు నిర్మాణ సంస్థ మళ్లీ డ్రాగన్ అనే కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. తాజాగా ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. లాంచ్ వేడుకతో పాటు షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


ఈ కొత్త చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించనున్నారు. ప్రదీప్ లీడ్ రోల్ పోషిస్తుండగా, ఓ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM