by సూర్య | Tue, Apr 06, 2021, 05:39 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో అజిత్ తన భార్య షాలినీతో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. దీంతో అజిత్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ను అజిత్ కోపంగా లాక్కుని, తన జేబులో పెట్టేసుకున్నాడు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం తన అభిమానికి ఆ ఫోన్ ను అందజేశాడు.
Latest News