by సూర్య | Thu, Oct 15, 2020, 02:23 PM
బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కు భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ, దందా నడుపుతున్నారన్న ఆరోపణలపై సచిన్ జోషిని ముంబైలో అరెస్ట్ చేశారు. ఇటీవల భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు దొరకగా, నిందితులను విచారించిన పోలీసులు, సచిన్ జోషి ప్రమేయంపై ఆధారాలు సేకరించి, నిఘా పెంచారు. ఆపై సచిన్ ను అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సచిన్ జోషి ముంబైలో పట్టుబడ్డాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Latest News