by సూర్య | Tue, Oct 06, 2020, 03:38 PM
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి ముంబై హైకోర్టు వారికి షాక్ ఇచ్చింది. నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ ల రిమాండ్ ను పొడిగించింది. ఈనెల 20 వరకు వారికి రిమాండ్ పొడిగించింది. రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో జ్యుడీషియల్ కస్టడీ అక్టోబర్ 20 పొడిగించింది. ఇకపోతే సెప్టెంబర్ 4న రియా సోదరుడు షోవిక్ను, సెప్టెంబర్ 8న రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రియా చక్రవర్తి బైకులా జైలులో ఉండగా, షోవిక్ తలోజాను సెంట్రల్ జైలులో ఉన్నాడు. రోవైపు రియా, షోవిక్కు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది ఎన్సీబీ.. ఈ ఇద్దరూ డ్రగ్స్ సిండికేట్లో సభ్యులని.. ప్రముఖలందరికీ డ్రగ్స్ సరఫరా చేసేవారితో సంబంధాలున్నాయని కోర్టుకు విన్నవించారు.
Latest News