by సూర్య | Tue, Oct 06, 2020, 04:00 PM
కొద్ది రోజులుగా బాలీవుడ్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ముఖ్యంగా సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆమె స్వరం మరింత పెరిగింది. ఏకంగా మహారాష్ట్ర సర్కారుతోనే గొడవకు దిగింది. ఆ తర్వాత తనకు సంబంధం లేని పలు అంశాలపై కూడా కంగన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హథ్రస్ అత్యాచార ఘటనపై కంగన నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు.
కంగన బీజేపీ ఏజెంట్గా మారిపోయిందని విమర్శిస్తున్నారు. ఘటన జరిగిన యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టే కంగన నోరు మెదపడం లేదని కామెంట్లు చేస్తున్నారు. `దళిత యువతి మృతిపై మీరు ఎందుకు స్పందించడం లేదు. హథ్రాస్ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీ నిజాయితీని, మానవత్వాన్ని నిరూపించుకోవాల`ని సూచిస్తున్నారు. ఇక, శివసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలోకంగనపై విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ మృతిపై అంతగా గగ్గోలు పెట్టిన కంగన.. ఓ దళిత యువతి అత్యాచారానికి గురై చనిపోతే మాట్లాడలేకపోతోందని విమర్శిస్తున్నారు.
Latest News