by సూర్య | Tue, Oct 06, 2020, 04:08 PM
మెగా హీరో సాయితేజ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అందుకే `సోలో బ్రతుకే సో బెటరు` సినిమా డబ్బింగ్ కార్యక్రమం వాయిదా పడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన `సోలో బ్రతుకే సో బెటరు` మొత్తం నెగిటివ్ రైట్స్ను జీ గ్రూపు భారీ మొత్తం వెచ్చించి దక్కించుకుంది.
అక్టోబరు 1నాటికే ఈ సినిమా ఫస్ట్ కాపీని అందించాల్సి ఉంది. అయితే అనుకున్న సమయానికి డబ్బింగ్ పూర్తి కాలేదని తెలుస్తోంది. సాయితేజ్ ఇంకా డబ్బింగ్ చెప్పాల్సి ఉందట. అనారోగ్యం కారణంగా సాయితేజ్ బయటకు రావడం లేదని సమాచారం. అయితే సమస్య ఏంటో మాత్రం బయటకు తెలియడం లేదు. సాయితేజ్ పరిస్థితిని సదరు ఓటీటీ సంస్థకు వెల్లడించి మరికొంత సమయం అడగాలని నిర్మాత భోగవల్లి ప్రసాద్ భావిస్తున్నారట.
Latest News