ఏడాది పాటు రిలేషన్ షిప్... పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడు : సనమ్ శెట్టి

by సూర్య | Tue, Oct 06, 2020, 03:19 PM

తమిళ సినీ నటి, బిగ్ బాస్ 3 ఫేమ్ సనమ్ శెట్టి తాను మోసపోయానని వాపోయింది. మలేషియాలో ఉంటున్న దర్శన్ అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.


సనమ్ శెట్టి తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. కాలక్రమంలో ఆమెకు దర్శన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. ఇద్దరూ ఏడాది పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్ తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.


 


తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM