by సూర్య | Sun, Mar 29, 2020, 02:35 PM
నితిన్ తాజాగా భీష్మతో బంపర్ హిట్ అందుకున్నాడు. భీష్మ తర్వాత ఆయన నుండి వస్తోన్న మరో ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. కాగా ఈరోజు ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అందులో భాగంగా రంగ్ దేకు సంబందించి ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. నితిన్ భీష్మ చిత్రాన్ని నిర్మించిన సంస్థే ఈ రంగ్ దే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.