by సూర్య | Tue, Jan 14, 2020, 01:55 PM
విక్రమ్ ఒకే సారి రెండు భారీ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అందులో ఒకటి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ కాగా మరొకటి కోబ్రా. ఆయన ఈ రెండు భారీ చిత్రాలను ఏక కాలంలో పూర్తి చేస్తున్నాడు . పొన్నియిన్ సెల్వన్ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయి, కీర్తి సురేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లో మొదలుపెట్టారు. ఇటీవల ఆ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ చెన్నై చేరుకుంది. పొన్నియిన్ సెల్వన్ షెడ్యూల్ గ్యాప్ లో విక్రమ్ కోబ్రా షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కలకత్తాలో నిర్వహిస్తున్నారు. ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించడం విశేషం. తెలుగు మరియు తమిళ భాషలలో కోబ్రా వేసవి కానుకగా విడుదల కానుంది.
Latest News