by సూర్య | Tue, Jan 14, 2020, 02:03 PM
డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా బడ్జెట్ ను తగ్గించడానికి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, బాలయ్య – బోయపాటి చిత్రానికి కెమెరామెన్ గా చేయాల్సిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ స్థానంలో మరో కెమెరామెన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రూలర్ సినిమా విషయంలో రామ్ ప్రసాద్ పనితనం బాగాలేదనే ఈ సినిమా నుండి అతన్ని తప్పించినట్లు రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య గెటప్ విషయంలో రామ్ ప్రసాద్ కనీస అవగాహన కూడా లేకుండా రూలర్ సినిమాకి పని చేశాడని బాలయ్య ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పెదవి విరిచారు. ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా పిబ్రవరి మూడో వారం నుండి మొదలు కానుంది. షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. మే లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అట.
Latest News