by సూర్య | Sat, Oct 12, 2019, 07:30 PM
టైగర్ ష్రాఫ్.. హృతిక్ రోషన్ కథానాయకులుగా రూపొందిన భారీ చిత్రం 'వార్' , ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ యాక్షన్ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలివారం రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఈ సినిమా, 10వ రోజు పూర్తయ్యేనాటికి 250 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
ఇక ఈ ఒక్క రోజునే ఈ సినిమా 9 కోట్ల రూపాయలను వసూలు చేస్తోందని అంచనా. 300 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోవడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది 'కబీర్ సింగ్' తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవడం విశేషం. ఇక దక్షిణాదిన కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనించదగిన విషయం.
Latest News