రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

byసూర్య | Sat, Apr 27, 2024, 06:17 PM

నల్గొండ జిల్లా డిండి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం కందుకూరుకు చెందిన వెంకటయ్య(48) అనే వ్యక్తి చెరుకుపల్లి గేట్ నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బండరాయిని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం Mon, May 20, 2024, 02:47 PM
బీరప్ప ఉత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే Mon, May 20, 2024, 02:14 PM
మందుల దుకాణాన్ని ప్రారంభించిన విప్ Mon, May 20, 2024, 02:09 PM
బెంగళూరులో రేవ్ పార్టీ.. Mon, May 20, 2024, 01:16 PM
బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం Mon, May 20, 2024, 01:08 PM