'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్

by సూర్య | Thu, Apr 25, 2024, 03:25 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ ని ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ 1లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 17, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'ప్రాజెక్ట్ Z' మూవీ Thu, May 09, 2024, 09:53 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Thu, May 09, 2024, 08:12 PM
OTT : చిత్రీకరణ ప్రారంభించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 Thu, May 09, 2024, 08:10 PM
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM