సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ

byసూర్య | Thu, Oct 31, 2024, 05:19 PM

దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో టపాసులు కాల్చుకోవడంపై ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిమితులకు లోబడి టపాసులు కాల్చుకోవాలని వెల్లడించారు.ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దీపావళి పండుగ సందర్భంగా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ముందు గానీ లేదా రాత్రి 10 గంటల తర్వాత గానీ బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ రోడ్లపై బాణసంచా కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. దీనిని గమనించి అందరూ దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.


Latest News
 

అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్.. భారీ పద్దు.. అరకొర చర్చ! Mon, Mar 16, 2026, 08:30 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది Mon, Mar 16, 2026, 08:03 PM
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు: మండల ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం Mon, Mar 16, 2026, 07:56 PM
ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ! Mon, Mar 16, 2026, 07:51 PM
ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు – దరఖాస్తులు ప్రారంభం! Mon, Mar 16, 2026, 07:47 PM