byసూర్య | Wed, Oct 23, 2024, 07:18 PM
జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లోని సంబంధిత అధికారులతో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై సమీక్ష జరిపారు.
రాజీవ్ ఎత్తిపోతల పథకం మొదటి ఫేజ్ కింద 82. 35 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం డబ్బులు రైతులకు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న భూసేకరణను వేగిరం చేయాలన్నారు.