byసూర్య | Tue, Oct 15, 2024, 07:27 PM
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ పెద్ద చెరువులో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, మత్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నరసయ్య, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణలు పాల్గొన్నారు.