byసూర్య | Sun, Sep 29, 2024, 10:43 PM
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధితులతో కలిసి ఆదివారం కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.
అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో తన సొంత ఖర్చులతో 20 గ్రామాల్లో భూమి కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు అందించామన్నారు.