byసూర్య | Tue, Sep 24, 2024, 02:42 PM
ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి కలిసి పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్ కేటాయించి ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (27) దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.