byసూర్య | Sun, Sep 22, 2024, 07:12 PM
లక్షెట్టిపేట న్యాయస్థానంలో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయస్థానంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంపత్ అన్నారు. పోలీసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయన మాట్లాడుతూ.. రాజీ పడే కక్ష దారులు, డ్రంకెన్ డ్రివ్, పెట్టి కేసులు వున్నవారు కేసుల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లలో సంప్రదించాలన్నారు.
ఈసమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్, లక్షెట్టిపేట, ఎస్సై సతీష్, దండెపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్, హాజిపూర్ ఎస్సై సురేష్, జన్నారం ఎస్సై రాజవర్డన్ తదితరులు పాల్గొన్నారు.