ఏబీవీపీ మండలాల నూతనకమిటీఎన్నిక

byసూర్య | Sun, Sep 22, 2024, 07:15 PM

దేవరకొండ నియోజకవర్గం పరిధిలోనినేరేడుగొమ్ము మరియు పిఏ పల్లి శాఖఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రోజున నూతన నగర కమిటీనీ వెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో యలమల గోపీచంద్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఆర్గనైజేషన్ ఈరోజు చూసుకున్నట్లయితే 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా నిలిచింది అంటూ విద్యార్థులలో దేశభక్తి నింపుతూ విద్యార్థులను దేశం గురించి ఆలోచించే విధంగా తయారు చేసే ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్,ఏబీవీపీ నేరేడు కొమ్ము మరియు పి.ఏ పల్లి నూతన కమిటీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు కళాశాలలో పాఠశాలల్లో ఏబీవీపీ సభ్యత్వం నిర్వహించడం జరిగింది.
నేరేడు కొమ్ము నూతన నగర కమిటీ కార్యదర్శిగా బుడియ పాక సన్నీ , జాయింట్ సెక్రటరీగా ఎన్. కీర్తన, ఎం. అనుష, ఏ. నందిని, సిహెచ్.  పీ.ఏ పెల్లి మోడల్ కళాశాల నూతన కమిటీ అధ్యక్షుడిగా సిహెచ్. కార్తీక్, సెక్రటరీగా బి. శివాని జాయింట్ సెక్రటరీగా కే. గణేష్ తదితరులని ఎన్నుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కొండల్,అనిల్, అంజి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM