సంక్షేమ వసతిగృహాల పనితీరు మెరుగుపడాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

byసూర్య | Sun, Sep 22, 2024, 01:02 PM

దేవరకొండ నియోజక వర్గంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల పనితీరుపై నేడు దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద  నియోజక వర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు.గడిచిన మూడేండ్ల నుంచి పదో తరగతి పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని అడిగితెలుసుకున్నారు. మండల ప్రత్యేకాధికారులు హాస్టళ్లను తనిఖీ చేసిన సమయంలో గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యాబోధన, సరైన వసతి సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ లు,ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM