పిడుగుపాటుకు రెండు గేదేలు మృతి

byసూర్య | Sun, Sep 22, 2024, 10:42 AM

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల కేంద్రంలో అకాల వర్షానికి ఒక్కసారిగా పిడుగు పడటం వలన రెండు గేదెలు మృతి చెందిన సంఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడు కొండా ఎల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం శనివారం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉరుముల మెరుపులతో కురిసిన వర్షానికి తనకు ఉన్న రెండు గేదలు ఇంటిముందు చెట్టుకు కట్టేయడంతో పిడుగు పడి మృతి చెందినయని తెలిపారు.
బాధితుడికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో గేదెలపైనే జీవనాధారం కొనసాగిస్తున్నాడు తనకున్న రెండు గేదెలు ఒకేసారి చనిపోవడంతో కన్నీరు  పెట్టుకున్నాడు చూడటానికి వచ్చిన ప్రజలు ఎల్లయ్యను చూసి కన్నీరు కార్చారు బాధితుడిని ప్రభుత్వమే అనే విధాలుగా ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM