అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

byసూర్య | Fri, Sep 20, 2024, 03:57 PM

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు.
అంబేద్కర్ ఒక కులానికి, మతానికి కాదని సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పని చేసిన గొప్ప నాయకుడు అని విగ్రహాన్ని కూల్చితే రెట్టింపు స్థాయిలో ఆయన భావాజాలం ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జోగు నర్సింలు, ప్రశాంత్, యేసు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM