byసూర్య | Thu, Sep 19, 2024, 11:25 AM
తెలంగాణలో వినియోగదారులకు షాక్.. పెరగనున్న కరెంట్ ఛార్జీలు. విద్యుత్ పంపిణీ సంస్థలు తమ లోటు రూ. 1200కోట్లు పూడ్చుకోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించాయి.ఇళ్లకు 300యూనిట్లు దాటితే స్థిరఛార్జీ కిలోవాట్ కు 40 రూపాయలు పెంచాలంటూ.. అలాగే పరిశ్రమలకు అన్ని ఒకే కేటగిరీ కింద బిల్లు ఇవ్వడానికి ప్రతిపాదించాయి.ప్రభుత్వం గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుండటం.. 299 యూనిట్ల లోపు ఎలాంటి పెంపు లేకపోవడంతో.. 300 యూనిట్లు దాటి వాడే వారికి భారీగా కరెంట్ బిల్లులు పెరగనున్నాయి.