byసూర్య | Mon, Sep 16, 2024, 08:41 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి 25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం విధితమే. సోమవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు ఉన్నారు.