ఒకరికి తెలియకుండా ఒకరు ,,,తొమ్మిదో తరగతి బాలికకు గర్భం

byసూర్య | Sun, Sep 08, 2024, 07:15 PM

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు ఉన్నట్టుండి కడుపు నొప్పి మొదలైంది. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పటంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షలు చేసిన వైద్యులు ఆ అమ్మాయి గర్భవతి అని తేల్చారు. ఈ మాట విన్న తల్లి ఒక్కసారిగా హతాశురాలైంది. ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లి.. గట్టిగా ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. తన గర్భానికి ముగ్గురు యువకులు కారణమని చెప్పంది. తనకు మాయమాటలు చెప్పి.. ఒకరికి తెలియకుండా ఒకరు తనను లోబర్చుకున్నారని వివరించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది. అసలు ఇంతకూ ఏం జరిగిందంటే..


తొమ్మిదో తరగతి చదువుతున్న బాధిత విద్యార్థిని.. తండ్రి అనారోగ్యం కారణంగా కొంతకాలం క్రితమే చనిపోయాడు. దీంతో.. ఆర్థిక ఇబ్బందుల్లో పడిన కుటుంబ భారాన్ని ఆ తల్లే భుజాన వేసుకుంది. తన కూతురి చదువు మధ్యలో ఆగిపోవద్దని భావించి.. కూలీ పనులు, వ్యవసాయ పనులంటూ దొరికిన చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించటంతో పాటు కూతురికి చదువు కూడా చెప్పిస్తోంది.


ఎలాగూ ఇంటి పెద్ద లేడు.. తల్లి కూడా పనులకు వెళ్లి.. చీకటి పడే వరకు రాదు. దీంతో.. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో బాలిక ఒక్కతే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు కామాంధులు ఆ అమ్మాయిపై కన్నేశారు. ఎలాగైనా ఆ అమ్మాయిని అనుభవించాలని ప్లాన్ చేసిన ఆ దుర్మార్గులు.. ఎవరూ లేని సమయం చూసి.. ఇంట్లోకి వెళ్లి తనతో ప్రేమగా మాట్లాడేవారు. తండ్రి దూరమైన తనకు ఆ యువకులు ప్రేమ చూపించటంతో.. అది నిజమేనని బాధిత బాలిక నమ్మింది. ఇదే అదునుగా చేసుకున్న ముగ్గురు కామాంధులు.. మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అమ్మాయిని లోబర్చుకున్నారు. ఈ విషయం బయటికి తెలిస్తే.. తన పరువు పోతుందని భావించిందో.. లేదా తన తల్లి ఏమైపోతుందని భయపడిందో కానీ.. ఆ దుర్మార్గులు చేసిన అఘాయిత్యాన్ని ఎవరికి చెప్పకుండా తన కడుపులోనే దాచుకుంది.


దీంతో.. ఇటీవల అమ్మాయి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా.. ఆమెను దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. ఆ అమ్మాయి గర్భవతి అని తేలింది. ఈ విషయంపై బాలికను తల్లి నిలదీయటంతో.. మొత్తం తతంగాన్ని బయటపెట్టింది. దీంతో.. బాధిత బాలికను తీసుకుని.. ఆ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌ వెళ్లి ఆ ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేసింది.


బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గరిని తమదైన శైలిలో విచారించగా.. బాలికపై తామే అత్యాచారం చేసినట్లుగా అంగీకరించారు. దీంతో.. ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. బాధిత బాలికకు మెరుగైన వైద్యం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.



Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM