అరుణాచలం టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలోనే 4 రోజుల పర్యటన

byసూర్య | Sat, Sep 07, 2024, 07:18 PM

అరుణాచలేశ్వరుని భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుండగా.. వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్లేవారి కోసం ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది. అయితే.. ఈ ప్యాకేజీ కింద భక్తులు నాలుగు రోజుల పాటు ఈ పర్యటనను ఆస్వాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ 15, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ తప్పితే.. మళ్లీ అక్టోబరులోనే.


ఈ నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా.. మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరనుంది. మరునాడు ఉదయం నేరుగా కాణిపాకం చేరుకుంటారు. ఉదయం 9 గంటలలోపు వినాయకున్ని దర్శనం పూర్తవుతుంది. అనంతరం.. తిరువనమలైకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరుణాచలం చేరుకుంటారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు. ఇక.. మూడో రోజు అల్పాహారం చేసి.. వేలూరుకు బయలుదేరతారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సందర్శించి.. సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు మళ్లీ హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.


ఇదిలా ఉంటే.. ఈ ప్యాకేజీలో వెళ్లే వారికి ఒక్కొక్కరికీ.. పెద్దవాళ్లయితే 8000 రూపాయలు, పిల్లలైతే 6400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని పొందేందుకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/ లోకి వెళ్లి.. హైదరాబాద్ టూ అరుణాచలం ప్యాకేజీని క్లిక్ చేస్తే సరి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు అక్కడే బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్‌ను కూడా సంప్రదించవచ్చు. లేదా.. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది.


హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=342&journeyDate=2024-08-16&adults=2&childs=0


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM