ఘనంగా ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశం

byసూర్య | Fri, Jul 12, 2024, 12:25 PM

దోమ మండల పరిధిలోని బుదులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను గురువారం గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బద్రీ నాయక్ మాట్లాడుతూ. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లాల్య నాయక్, ఉపాధ్యాయురాలు వాణి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM