byసూర్య | Fri, Jul 12, 2024, 12:25 PM
దోమ మండల పరిధిలోని బుదులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను గురువారం గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బద్రీ నాయక్ మాట్లాడుతూ. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లాల్య నాయక్, ఉపాధ్యాయురాలు వాణి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.