byసూర్య | Fri, Jul 12, 2024, 11:54 AM
ఆత్మకూరు మండల గ్రామాలలో పశువులను అపహరించిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం పోలీసులు వాహనాల తనిఖీలను చేస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన పోలీసులు గద్దించారు. నంద్యాల జిల్లా నుంచి వచ్చామని, గ్రామాలలో పశువులను అపహరించారని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశామని సీఐ శివ కుమార్, ఎస్ఐ నరేందర్ తెలిపారు.