byసూర్య | Thu, Jul 11, 2024, 11:51 AM
రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క తెలిపారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్పై అధికారులతో సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫాంలు అందిస్తామన్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ పేరుతో జులై 15 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం చేపడతామన్నారు.