ఎకరాకు రూ.15 వేలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, నేటి నుంచే..

byసూర్య | Wed, Jul 10, 2024, 08:22 PM

తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు రూ. 10 అందించిన సంగతి తెలిసిందే. ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు విడతలుగా రైతుల అకౌంట్లలో పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం జమ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ మెుత్తాన్ని రూ. 15 వేలకు పెంచింది. ఈ వానాకాలం సీజన్ నుంచి పంట సాగు చేసే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. అందుకు కార్యచరణ కూడా రూపొందించింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పథఖం అమల కోసం విధివిధానాల రూపకల్పనకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అప్పటికే ఈ పథకంపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాుట చేశారు. తాజాగా.. హైదరాబాద్‌ మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక వర్క్ షాప్‌లను నిర్వహించేందుకు మంత్రివర్గ ఉపసంఘం రెడీ అయింది. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మం నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు సభ్యులుగా ఉన్నారు. వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ఈ వర్క్ షాప్‌లో పాల్గొననున్నారు.


ఖమ్మం కలెక్టరేట్‌ ఆవరణలో జరిగే ఈ వర్క్ షాప్‌లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, అన్నదాతలు, రైతు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధివిధానాలపై రైతులు, అధికారుల అభిప్రాయాలను సేకరించనున్నారు. గతంలో సాగులో లేని భూములకు కూడా పంట పెట్టబడి సాయం అధించారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ భూములకు సైతం రైతుబంధు నిధులను జమ చేశారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం పక్కాగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తుందని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక రైతు భరోసా కింద 5 ఎకరాల వరకే పంట పెట్టుబడి సాయం అందిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజా వర్క్ షాపుల్లో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM