పరీక్షలు వాయిదా వేస్తే వారికి రూ.100 కోట్ల లాభం.. అందుకే ఈ కృత్రిమ ధర్నాలు: సీఎం రేవంత్

byసూర్య | Wed, Jul 10, 2024, 09:21 PM

తెలంగాణలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని వాయిదా వేయాలంటూ పలువురు విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచటంతో పాటు మూడు నెలల పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉస్మానియా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు ధర్నాలు చేస్తుండగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. డీఎస్సీ వాయిదా వేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మంగళవారం (జులై 9) మహబూబ్‌నగర్ సభలో మాట్లాడిన రేవంత్.. పోటీ పరీక్షల వాయిదా డిమాండ్ వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్‌ సెంటర్ల మాఫియా కావాలని కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోందన్నారు. రెండు, మూడు నెలల పాటు పోటీ పరీక్షలను వాయిదా వేయిస్తే రూ.100 కోట్లకు పైగా ఫీజుల రూపంలో సంపాదించొచ్చనే ఆలోచనతో పలు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఉన్నారన్నారు. అందుకే విద్యార్థులను ఉసిగొల్పి వారితో కృత్రిమ ఆందోళనలు చేయిస్తున్నారని విమర్శించారు.


నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే భావనతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి పొలిటికల్ మైలేజీ పొందాలని చూస్తున్నారని ఫైరయ్యారు. వారిద్దరూ యువతను రెచ్చగొట్టడం వల్లే గతంలో చాలా మంది నిరుపేద యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతను వాడుకోకుండా ఆ ఇద్దరూ కలిసిఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు.


పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. తాజాగా గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులు, డీఎస్సీ ద్వారా 11,500 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పరీక్షలను వాయిదా వేయాలని పలువురు కోచింగ్‌ కేంద్రాల నిర్వాహకులు తమ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇప్పుడు పోటీ పరీక్షలను వాయిదా వేస్తే రూ.వేలల్లో అప్పులు చేసి గ్రామాల నుంచి నగరానికి వచ్చి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM