byసూర్య | Tue, Jul 09, 2024, 03:17 PM
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న గ్రామపంచాయతీకి చెందిన విలువైన గ్రానైట్ ( బేస్మెంట్ ) రాయిని ఎలాంటి అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్న కాంట్రాక్టర్ పైన ప్రత్యేక అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు దేశబోయిన నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈసందర్బంగా అధికారులు స్పందించకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.