byసూర్య | Tue, Jul 09, 2024, 03:22 PM
కల్వకుర్తి పట్టణంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళిత ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పులిజాల పరశురాములు మాట్లాడుతూ చట్టాలు అమలు చేసే స్థానంలో ఉన్న పోలీసు శాఖలో కుల వివక్ష వేధింపులు ఉండటం వల్లే దళిత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొని మరణించాడని అన్నారు.