byసూర్య | Tue, Jul 09, 2024, 03:15 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం సమస్యలపై రక్షణ కొరకు పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల చట్ట ప్రకారంగా వ్యవహరించని అధికారుల పైన కేసులు నమోదు చేసి, కఠినచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వవాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యంపల్ల పురుషోత్తం రెడ్డి మంగళవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. ప్రజలు చెల్లించే పన్నులను జీతాలుగా పొందుతున్న పోలీసులు, అధికారులు ప్రజలకు సేవకులుగా ఉండాలన్నారు.