byసూర్య | Tue, Jul 09, 2024, 10:41 AM
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం వివిధ ఆర్టీసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో పలు గ్రామాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభిచాలన్నారు. వివిధ గ్రామాలకు ప్రస్తుతం వున్న సర్వీసులను పొడగించి బస్సు సౌకర్యం కల్పించాలని మేనేజర్లను కోరారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి నుండి భువనగిరి మీదుగా వెళ్లే ప్రతి బస్సు భువనగిరి బస్టాండ్ కు తప్పనిసరిగా రావాలన్నారు.