byసూర్య | Tue, Jul 09, 2024, 10:28 AM
నూతన ఆవిష్కరణలకు సిద్దిపేట జిల్లా వేదిక కావాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకాంక్షించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేషన్ లో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటి నుంచి నైపుణ్యం కలిగిన వారు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ఇన్నోవేటర్ మారాలన్నారు. చదువు, వయసుతో పని లేదన్నారు.