byసూర్య | Tue, Jul 09, 2024, 10:28 AM
జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజావాణికి వస్తారన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ 31 దరఖాస్తులు వచ్చాయన్నారు.