byసూర్య | Tue, Jun 25, 2024, 08:01 PM
వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమై ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కుంట చింటూ (20) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించగా.. ఆమె ప్రేమను తిరస్కరించింది. దీంతో మనస్థాపం చెందిన చింటూ తమ వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, చింటూ 2023లో ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ఇటీవలే బెంగళూరులో శిక్షణ సైతం పూర్తి చేసుకున్నాడు. గుజరాత్లో పోస్టింగ్ ఇవ్వగా.. త్వరలోనే ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది.
బెంగళూరు నుంచి సెలవుపై గ్రామనికి వచ్చిన చింటూ.. ప్రేమించిన అమ్మాయి ప్రేమను తిరస్కరించిందని తన బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అమ్మాయి ప్రేమ కోసం తల్లిదండ్రులకు తీరని వేధనను మిగిల్చాడు. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణం చెందటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.