byసూర్య | Sun, Jun 23, 2024, 08:19 PM
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో శనివారం దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నారాయణపేట అంబేద్కర్ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తోరోకో నిర్వహించారు. దళితుల ఇళ్ల పైకి వచ్చి దాడులకు పాల్పడ్డారని, దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.