byసూర్య | Sun, Jun 23, 2024, 08:18 PM
నీట్ పేపర్ లీకేజి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పివైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్, ప్రతాప్ డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలపై వస్తున్న అనుమానాలను ప్రధాని నివృత్తి చేయాలని, పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.