బీజేపీ అధ్యక్షుడి పదవిపై ఈటల రాజేందర్ సంచలన ప్రకటన.. రాజాసింగ్‌కు స్ట్రాంగ్ కౌంట

byసూర్య | Sun, Jun 23, 2024, 07:42 PM

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా తెరవకపోగా.. బీజేపీ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ సర్కార్.. తెలంగాణ నుంచి ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కీలక మంత్రి పదవి అయిన బొగ్గు, గనుల శాఖ అప్పగించగా.. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న రూల్ ప్రకారం.. ఒక నేతకు ఒకటే పదవి. దీని ప్రకారం.. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను వేరేకరికి అప్పగించే పనిపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఈ పదవి కోసం.. చాలా మంది నేతలే పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. అయితే.. ఈటల రాజేందర్‌కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, రాజకీయ అనుభవం ఇలా చాలా ఫ్యాక్టర్లే ఆయనకు మొగ్గు చూపుతుండగా.. పార్టీలోని నేతలు మాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.


తెలంగాణలో బీజేపీని నడిపించేందుకు నాయకుడు మాత్రమే కాదు.. ఫైటర్ కావాలంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడేవాళ్లు కావాలని.. అందరినీ కలుపుకునిపోయే లీడర్ కావాలంటూ అధిష్ఠానానికి సూచించారు. ఈ కామెంట్లు.. ఈటలను ఉద్దేశించే అన్నాడంటూ చర్చ నడిచింది. దీనిపై స్వయంగా ఈటల రాజేందరే స్పందిస్తూ.. సంచలన ప్రకటన చేశారు.


హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలని ఒకాయట అంటున్నారని గుర్తు చేసిన ఈటల.. గల్లీలో కొట్లాడే ఫైటర్ కావాలా అంటూ సెటైర్లు వేశారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని.. వీధుల్లో కొట్లాడే ఫైటర్ కాదని.. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలంటూ తెలిపారు. తన లాంటి వాళ్లు ఊరికే మాట్లాడరని.. సందర్భం వచ్చినప్పుడు జేజెమ్మలతో కొట్లాడతామని ఈటల గుర్తు చేశారు. రేవంత్ రెడ్డితో కూడా కొట్లాడతానని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతానన్నారు. ఆ బాధ్యత తనకే ఉందని భావిస్తున్నట్టు తన మనసులో మాట బయటపెట్టారు. కాగా.. ఈ ప్రకటనతో.. రాజాసింగ్‌కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారా అన్న చర్చ నడుస్తోంది. పార్టీలో కొన్ని లుకలుకలు నడుస్తున్నట్టుగా చర్చించుకుంటున్నారు.



Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM