byసూర్య | Wed, Jun 19, 2024, 02:19 PM
నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండలో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ ఆర్ అండ్ ఆర్ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.