byసూర్య | Wed, Jun 19, 2024, 02:14 PM
కోదాడ పరిధిలోని తమ్మరలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన మొగిలివెంకన్న పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... గొర్రెలు అమ్మగా వచ్చిన నాలుగు లక్షల రూపాయలు, టీవీ, మూడు తులాల బంగారం, రెండు బీరువాలు ఈ ఘటనలో దగ్ధమైపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక కౌన్సిలర్ సామినేని నరేష్ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేపిస్తానని హామీ ఇచ్చారు.