సెల్ఫీ తీసుకుంటూ నీటిలో జారిపడిన కూతురు.. ఆమెను కాపాడబోయి తండ్రి మృతి, ఎంత విషాదం

byసూర్య | Tue, Jun 18, 2024, 08:15 PM

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన కూతురుని కాపాడబోయి తండ్రి మృతిచెందాడు. కూతురు సెల్ఫీ తీసుకుంటా నీటిలో జారిపడగా.. ఆమెను రక్షించే క్రమంలో తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ (47) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం గుడికి వెళ్లాడు. బక్రీద్ సెలవు దినం కావటంతో గుడికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో భార్య, కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్‌తో కలిసి ఎల్ఏండీ రిజర్వాయర్ వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు.


రిజర్వాయర్ వద్ద సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడిపోయింది. గమనించిన తండ్రి విజయ్ కుమార్, అన్నయ్య విక్రాంత్ నీటిలో దూకారు. ముగ్గురు నీటిలో మునిగిపోవటం చూసి ఒడ్డునే ఉన్న భార్య గట్టిగా కేకలు వేసింది. సమీపంలోనే ఉన్న శంకర్ అనే మత్స్యకారుడు.. సాహసం చేసి నీటిలో దూకాడు. సాయినిత్య, విక్రాంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చగా.. విజయ్ కుమార్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని మృతదేహాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


స్థానిక మత్స్యకారుల సాయంతో విజయ్ డెడ్ బాడీని బయటకు తీశారు. కళ్లెదుటే తండ్రి చనిపోవటంతో పిల్లలిద్దరూ గుండెలవిసేలా రోధించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM